Black Circles: కళ్ల కింద నల్లని వలయాలున్నాయా..? ఎందుకు వస్తాయో తెలుసుకోండి..
నిద్ర సరిగా పోకపోయినా, మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నా కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతాయి. వాటిని చూడగానే మానసిక సంఘర్షణకు లోనైనట్టు తెలిసిపోతుంది. ఆ నల్లని వలయాలను తగ్గించుకోవడానికి రకరకాల మందులను చాలా మంది వాడుతుంటారు. కొంతమంది చర్మవ్యాధి నిపుణులను కలుసుకుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: నిద్ర సరిగా లేకపోయినా, మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నా కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. వాటిని చూడగానే మానసిక సంఘర్షణకు లోనైనట్లు తెలిసిపోతుంది. ఆ నల్లని వలయాలను తగ్గించుకోవడానికి రకరకాల మందులు వాడుతుంటారు. కొంతమంది చర్మవ్యాధి నిపుణులను కలుస్తారు. వాస్తవానికి ఈ సమస్య ఇన్ఫెక్షన్లు, కంట్లో రక్తకణాలు దెబ్బతినడంతో పాటు వంశపారంపర్యంగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వలయాలు ఎందుకొస్తాయి..? వాటికి ఏ పరిష్కార మార్గాలున్నాయో ప్రముఖ డెర్మటాలజిస్టు డాక్టర్ సందీప్ వివరించారు.
నలుపు సమస్యకు కారణాలెన్నో..
కళ్ల కింద నలుపు రావడానికి చాలా కారణాలుంటాయి. కళ్లద్దాలు వాడటం, అధిక పని ఒత్తిడి, మానసిక ఆందోళన, రక్తహీనత, హార్మోన్ల సమస్య, అధిక బరువు, పీసీవోడీలతో వస్తుంది. ఇది వ్యాధి కాదు. లక్షణం మాత్రమే. హిమోగ్లోబిన్ పెంచే ఆహారం తీసుకోవడంతో పాటు కంటికి విశ్రాంతి ఇస్తే చాలా వరకూ తగ్గిపోతుంది. స్మార్ట్ఫోన్లు, టీవీలు ఎక్కువ సేపు చూడటం కూడా మంచిది కాదు. కాస్మోటిక్స్ వాడటంతో కూడా నల్లని వలయాలు వస్తాయి.
ఏం చేస్తే పోతుందంటే..
ముందుగా జీవనశైలి మార్చుకోవాలి. వీటికి ఇచ్చే మందులు 40 శాతం మాత్రమే పని చేస్తాయి. హిమోగ్లోబిన్ పెంచుకోవాలి. నిద్ర సరిపోయినంత ఉన్నప్పుడు నలుపు తగ్గిపోతుంది. విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. కంటికింద కొబ్బరి నూనె రాసుకొని నిద్రపోవాలి. గులాబీ రేకులను మెత్తగా నలిపి కళ్ల కింద రాసుకోవచ్చు. పుచ్చకాయల గుజ్జు బాగానే పని చేస్తుంది.. ఆలుగడ్డ, కీరాలను చక్రాలుగా కోసి కళ్లపైన పెట్టుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్