Mallu Swarajyam: మల్లు స్వరాజ్యం భౌతికకాయం వద్ద ప్రముఖుల నివాళి

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, 

Updated : 20 Mar 2022 12:56 IST

హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ ప్రజాసంఘాల నేతలు నివాళులర్పించారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌కు ఆమె భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కవిత, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నేతలు రాఘవులు, మధు, తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ తదితరులు మల్లు స్వరాజ్యం పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. ఆమెను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎంబీ భవన్‌ వద్దకు చేరుకున్నారు. సాయుధ పోరాటంలో స్వరాజ్యం అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని నల్గొండ తరలించారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని