ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్డు నిర్మాణం

త్రిపురలో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిర్మించిన రోడ్డును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లవ్‌దేవ్‌ కుమార్‌ ప్రారంభించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి వాటిని రీసైక్లింగ్‌ చేయడం ద్వారా 680 మీటర్ల రోడ్డును నిర్మించినట్లు బిప్లవ్‌దేవ్‌ తెలిపారు....

Updated : 24 Feb 2021 04:28 IST

అగర్తలా: త్రిపురలో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిర్మించిన రోడ్డును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లవ్‌దేవ్‌ కుమార్‌ ప్రారంభించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి వాటిని రీసైక్లింగ్‌ చేయడం ద్వారా 680 మీటర్ల రోడ్డును నిర్మించినట్లు బిప్లవ్‌దేవ్‌ తెలిపారు. రాజధాని అగర్తలాలోని బీకే రోడ్డులో ఉన్న మహిళా కళాశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ రోడ్డు రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్లాస్టిక్‌ రోడ్డుగా ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిర్మించిన ఈ రోడ్డు నిర్మాణానికి రూ.70 లక్షల ఖర్చయినట్లు పశ్చిమ త్రిపుర జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో మరిన్ని రహదారులను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని