కొండగట్టు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం:తెరాస
జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ..
కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం మంత్రితో పాటు ఎమ్మెల్సీ కవిత కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.90 లక్షలతో రామకోటి స్థూపాన్ని నిర్మిస్తున్నామన్నారు. జూన్ 4వ తేదీ లోపు నిర్మాణం పూర్తి చేయడానికి ఇవాళ భూమిపూజ చేసినట్టు చెప్పారు. 23 అడుగుల ఎత్తున స్థూపం నిర్మిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. యాదాద్రి ఆలయాన్ని రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దేనని మంత్రి అన్నారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..‘‘ కొండగట్టు అంజన్న తెలంగాణ ప్రజల కొంగు బంగారం. కొండగట్టు ఆంజనేయ సేవాసమితి ఏర్పాటు చేస్తాం. ఇంటింట్లో హనుమాన్ చాలీసా జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ నెల 17 నుంచి అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది’’ అని ఆమె అన్నారు. భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంజయ్, సుంకే రవిశంకర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!