తెలంగాణలో కొత్తగా 2,157 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 72,364 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 72,364 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 2,157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న వీటి సంఖ్య 3,052గా ఉండేది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 8 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,780కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 821 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,07,499కి చేరింది. ప్రస్తుతం 25,459 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 16,892 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 361 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,12,53,374కి చేరింది.
కొవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 20,10,611మంది డోస్- 1, 3,12,340 మందికి డోస్- 2 టీకా ఇచ్చారు. నిన్న ఒక్క రోజు డోస్-1 టీకాను 31,077మందికి, డోస్-2 టీకాను 2506 మందికి డోస్-2 టీకాను వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!