TS: కొత్తగా 3,982 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 71,616 నమూనాలను పరీక్షించగా 3,982 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది....

Published : 18 May 2021 18:59 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 71,616 నమూనాలను పరీక్షించగా 3,982 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన  కరోనా కేసుల సంఖ్య 5,36,766కి చేరింది. తాజాగా మరో 27 మంది మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 3,012కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 48,110 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ఇవాళ 5,186 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు పేర్కొంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 607 మందికి పాజిటివ్‌గా తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని