TS: కొత్తగా 2,493 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 94,189 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,493 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ

Updated : 01 Jun 2021 20:41 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 94,189 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,493 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని  వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన  కరోనా కేసుల సంఖ్య 5,80,834కి చేరింది. తాజాగా మరో 15 మంది మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 3,296కి పెరిగింది. గడచిన 24గంటల్లో కరోనా నుంచి 3,308 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33,254 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 318 కేసులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని