TS news: కొత్తగా 1,436 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమేపి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 97,751 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,436 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ

Published : 06 Jun 2021 19:30 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమేపి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 97,751 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,436 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,91,170కి చేరింది. తాజాగా మరో 14 మంది మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 3,378కి పెరిగింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి 3,614 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27,016 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో రికవరీ రేటు 94.85 శాతానికి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని