Ts EAMCET: తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా

తెలంగాణలో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్లు ఉన్నత విద్యా

Published : 26 Sep 2022 16:44 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇంజినీరింగ్ ఫీజుల విషయం కొలిక్కి రాకపోవడంతో సెప్టెంబర్‌ 28 నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తిరిగి అక్టోబర్‌ 11 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం అవుతుందని వెల్లడించింది. అక్టోబర్‌ 11, 12న స్లాట్‌ బుకింగ్‌, అక్టోబర్‌ 12న రెండో విడత ధ్రువప్రతాల పరిశీలన, 12, 13న వెబ్‌ అప్షన్ల నమోదు ప్రక్రియ, అక్టోబరు 16న సీట్లను కేటాయింపు ఉంటుందని ఉన్నత విద్యామండలి ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని