TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌ టాపర్లు వీళ్లే..

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో టాపర్ల వివరాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

Updated : 12 Aug 2022 16:08 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో టాపర్ల వివరాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డికి మొదటి ర్యాంకు వచ్చింది. రెండో ర్యాంకు నక్కా సాయిదీప్తిక (రేగిడి ఆమదాలవలస, శ్రీకాకుళం), మూడో ర్యాంకు పొలిశెట్టి కార్తికేయ (తెనాలి, గుంటూరు), నాలుగో ర్యాంకు పల్లి జలజాక్షి (సంతబొమ్మాళి, శ్రీకాకుళం), ఐదో ర్యాంకు మెండ హిమవంశీ (బలగ, శ్రీకాకుళం) దక్కించుకున్నారు. 

అగ్రికల్చర్‌ విభాగంలో.. జూటూరి నేహ (తెనాలి, గుంటూరు)కు మొదటి ర్యాంకు వచ్చింది. రెండో ర్యాంకు వంటాకు రోహిత్‌ (కోటపాడు, విశాఖపట్నం), మూడో ర్యాంకు కల్లం తరుణ్‌కుమార్‌రెడ్డి (కొమెరపూడి, గుంటూరు), నాలుగో ర్యాంకు కొత్తపల్లి మహి అంజన్‌ (కూకట్‌పల్లి), ఐదో ర్యాంకు గుంటుపల్లి శ్రీరామ్‌ (బృందావన్‌ గార్డెన్స్‌, గుంటూరు)కు వచ్చాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని