TS NEWS: కృష్ణానదిపై కొత్త ఆనకట్ట

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో  తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కృష్ణానదిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జోగులాంబ గద్వాల - వనపర్తి జిల్లాల మధ్య కృష్ణానది..పై

Updated : 30 Aug 2022 11:49 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్‌ కుడి కాల్వలపై తెలంగాణ కేబినెట్‌ నిరసన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో  తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్జీటీ, కేంద్రం ఆదేశాలను ఏపీ బేఖాతరు చేసిందని, కేంద్రం వైఖరితో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థి నెలకొందని కేబినెట్‌ అభిప్రాయపడింది.

ఈనేపథ్యంలో కృష్ణానదిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జోగులాంబ గద్వాల - వనపర్తి జిల్లాల మధ్య కృష్ణానదిపై అలంపూర్‌ వద్ద గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్దమారూరు గ్రామాల పరిధిలో ఆనకట్ట నిర్మించాలని నిర్ణయించింది. జోగులాంబ ఆనకట్ట ద్వారా 60-70 టీఎంసీల వరద నీటిని పైప్‌లైన్‌ ద్వారా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల జలాశయానికి నీటిని ఎత్తిపోసి పాలమూరు, కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని కేబినెట్‌ నిర్ణయించింది. కృష్ణ మండలంలోని కుసుమర్తి గ్రామం వద్ద భీమా వరద కాల్వను నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని