Telangana News: 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతి
తెలంగాణలో గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. 9,168 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. 9,168 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్-4 పోస్టులను భర్తీ చేయనున్నారు.
గ్రూప్ 4 ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీ పోస్టులున్నాయి. 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు, 1,862 వార్డు ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఆర్థికశాఖలో 191, పురపాలకశాఖలో 238 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.. వ్యవసాయశాఖలో 44, బీసీ సంక్షేమశాఖలో 307, పౌరసరఫరాల శాఖలో 72 ఉన్నాయి. అటవీశాఖలో 23, ఆర్థికశాఖలో 46, వైద్య- ఆరోగ్యశాఖలో 338, ఉన్నత విద్యాశాఖలో 742 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. హోంశాఖలో 133, నీటిపారుదల శాఖలో 51, కార్మికశాఖలో 128, మైనార్టీ సంక్షేమశాఖలో 191 జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. పురపాలక శాఖలో 601, పంచాయతీరాజ్ శాఖలో 1,245, రెవెన్యూశాఖలో 2,077, ఎస్సీ అభివృద్ధి శాఖలో 474 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అనుమతి ఇచ్చారు. సెకండరీ విద్యాశాఖలో 97, రవాణాశాఖలో 20, గిరిజన సంక్షేమ శాఖలో 221, మహిళా, శిశు సంక్షేమ శాఖలో 18, యువజన సర్వీసుల శాఖలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ