Viveka Murder Case: అవినాష్ నిందితుడని సీబీఐ ఎక్కడా చెప్పలేదు: అవినాష్ తరఫు న్యాయవాది
మాజీమంత్రి వై.ఎస్.వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది.
హైదరాబాద్: మాజీమంత్రి వై.ఎస్.వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరుపుతోంది. వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం. లక్ష్మణ్ ఎదుట అవినాష్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్, దర్యాప్తు, కోర్టుల్లో జరిగిన పరిణామాలను కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు.
‘‘అవినాష్ నిందితుడని రికార్డుల్లో సీబీఐ ఎక్కడా చెప్పలేదు. గుండెపోటు అన్నంత మాత్రాన నేరం చేసినట్టే అనడం సరికాదు. అవినాష్ వైద్యుడో, పోలీసు అధికారో కాదు కదా? ఏ1 గంగిరెడ్డికి వివేకాతో భూ వివాదాలు ఉన్నాయి. సునీల్, ఉమాశంకర్కు వివేకాతో వ్యాపారంలో విబేధాలున్నాయి. తమ కుటుంబ మహిళల విషయంలోనూ వారికి వివేకాపై కోపం ఉంది. డ్రైవర్గా దస్తగిరిని తొలగించిన వివేకా.. ప్రసాద్ను పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి అవినాషే కారణమని వివేకా భావించారు. వివేకా ఓటమికి కారణాలను సాక్షులే వివరించారు. స్థానిక నేతలు సహకరించకే ఓడిపోయారని సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. దస్తగిరి తీసుకున్న రూ.కోటిలో రూ. 46.70లక్షలే రికవరీ చేశారు. మిగతా సొమ్ము ఏమైందో సీబీఐ చెప్పడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీ టికెట్పై అవినాష్ను సీబీఐ అనుమానిస్తోంది.
రెండు ఛార్జిషీట్లలో అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదు. రెండు ఛార్జిషీట్లు వేసే వరకు కనీసం విచారణ జరపలేదు. అనుబంధ ఛార్జిషీట్ వేసిన ఏడాది తర్వాత 160 నోటీసులు ఇచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగానే అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. విచారణకు సహకరించడం అంటే.. సీబీఐ రాసిచ్చింది చెప్పడమా?విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్లు కోర్టు ముందుంచాలి. సీబీఐకి దురుద్దేశం లేకపోతే.. కస్టోడియల్ విచారణ జరపాల్సిన అవసరం ఏమొచ్చింది?
తల్లికి అనారోగ్యం వల్ల అవినాష్ విచారణకు హాజరు కాలేకపోయారు. దర్యాప్తు అధికారికి అవినాష్ రెడ్డి సమాచారం ఇచ్చి వెళ్లారు. పులివెందుల వెళ్తానని చెప్పినప్పటికీ అక్కడ లేరని సీబీఐ పేర్కొనడం సరికాదు. మెరుగైన వైద్యం కోసం అత్యవసరంగా కర్నూలు ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. మెరుగైన చికిత్స కోసం ఈరోజు హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ వెళ్తున్నట్టు ఈ ఉదయం సీబీఐ డైరెక్టరకు లేఖ రాశారు. ఇన్నాళ్లూ లేనిది ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ ఎందుకు అవినాష్పై ఒత్తిడి తెస్తోంది?’’ అని జస్టిస్ ఎం.లక్ష్మణ్ వెకేషన్ బెంచ్ ముందు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు విపినించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి