Telugu News: కృష్ణా జిల్లా రైతుల పిటిషన్పై విచారణ ముగించిన తెలంగాణ హైకోర్టు
అంతర్రాష్ట్ర జలవివాదాలపై విచారణ జరపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జల విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ రైతులు
హైదరాబాద్: అంతర్రాష్ట్ర జలవివాదాలపై విచారణ జరపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జల విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ రైతులు గతేడాది దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ ముగించింది. అన్ని జల విద్యుత్ ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిచేసేలా గతేడాది జూన్లో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సర్కారు జీవోలను సవాల్ చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అంతర్రాష్ట్ర జలవివాదాలపై విచారణ జరపలేమని, సుప్రీంకోర్టు లేదా ప్రత్యేక కోర్టులకే ఆ పరిధి ఉంటుందని సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం పేర్కొంది. పిటిషన్పై విచారణ ముగించిన ధర్మాసనం.. చట్ట పరమైన ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ