Ts High court: ఆ నలుగురికి గ్రూప్‌-1 హాల్‌టికెట్లు ఇవ్వండి: హైకోర్టు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసే అనుమతి లభించింది. 

Published : 09 Jun 2023 21:27 IST

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసే అనుమతి లభించింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  షమీమ్‌, సురేశ్‌, రమేశ్‌, సాయి సుష్మిత అనే అభ్యర్థులు తమపై టీఎస్‌పీఎస్సీ విధించిన డీబార్‌ను ఎత్తివేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. జూన్‌ 11న జరిగే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు అనుమతి ఇచ్చింది. ఈ నలుగురికి హాల్‌టికెట్లు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. కాగా.. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో నిందితులుగా తేలిన 50 మంది నిందితులు పరీక్ష రాయకుండా టీఎస్‌పీఎస్సీ శాశ్వత డీబార్‌ విధించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని