పరీక్షల వాయిదా పిటిషన్‌కు టీఎస్‌ హైకోర్టు నో

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షల వాయిదాపై హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయడానికి ఎన్‌ఎస్‌యూఐ

Updated : 05 Jul 2021 12:20 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షల వాయిదాపై హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయడానికి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రయత్నించారు. పిటిషన్‌ స్వీకరణకు అనుమతి కోరగా.. స్పందించిన హైకోర్టు పరీక్షల అంశాన్ని అత్యవసర విచారణకు నిరాకరించింది. చివరి నిమిషం వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఇప్పటికే పరీక్షలు ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా లంచ్‌మోషన్ పిటిషన్‌కు అనుమతి ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. మరోవైపు ఈ ఉదయం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద డిగ్రీ, పీజీ విద్యార్థులు పరీక్షలను వాయిదా వేయాలని నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని