Telangana News: తెలంగాణపై తీవ్రమైన చర్యలకు దిగొద్దు: హైకోర్టు
తెలంగాణ, ఏపీ విద్యుత్ బకాయిల వివాదంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ విద్యుత్ సంస్థలకు
హైదరాబాద్: తెలంగాణ, ఏపీ విద్యుత్ బకాయిల వివాదంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ విద్యుత్ సంస్థలకు రూ.7వేల కోట్ల బకాయిలు చెల్లించాలన్న కేంద్ర విద్యుత్శాఖ ఉత్తర్వులపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ పి.నవీన్రావు, జస్టిస్ సాంబశివనాయుడు ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే, ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి, కేంద్రం తరఫున అదనపు సోలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి వాదనలు వినిపించారు. పునర్విభజన చట్టం ప్రకారం దక్షిణ ప్రాంతీయ మండలి చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, కేంద్రానికి ఆ అధికారం లేదని తెలంగాణ వాదించింది. పునర్విభజన వివాదాలపై కూడా నిర్ణయాధికారం కేంద్ర హోంశాఖకు ఉండగా.. కేంద్ర విద్యుత్ శాఖలో డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి ఉత్తర్వులు ఎలా ఇస్తారని వాదించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ అధికార పార్టీకి సహకరించినందుకే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారని దుశ్యంత్ దవే వాదించారు. రాష్ట్ర విభజన తర్వాత సరఫరా చేసిన విద్యుత్ బిల్లుల అంశానికి పునర్విభజన చట్టం సంబంధం లేదని ఏపీ వాదించింది. ఏపీ జెన్కో సరఫరా చేసిన విద్యుత్కు బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత తెలంగాణ సంస్థలకు ఉందని సీవీ మోహన్రెడ్డి వాదించారు. అప్పులు తీసుకొని విద్యుత్ఉత్పత్తి చేశామని, బిల్లులు చెల్లించకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని ఏపీ వాదించింది.
దక్షిణ ప్రాంతీయ మండలికి చట్టబద్ధత లేదని.. అయినప్పటికీ అక్కడ విచారణకు ఎలాంటి ఫలితం రాలేదన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ జోక్యంతోనే తెలంగాణకు ఏపీ సరఫరా చేసినందున... బిల్లుల బకాయిల విషయంలో జోక్యం చేసుకొనే అధికారం తమకు ఉంటుందని కేంద్రం వాదించింది. అన్ని వాదనలు విన్న హైకోర్టు... పూర్తిస్థాయి విచారణ కోసం కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ విద్యుత్ సంస్థలను ఆదేశించింది. అప్పటి వరకు తెలంగాణపై కఠినమైన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వివరణ, వాదన వినకుండానే కేంద్రం ఉత్తర్వులు ఇవ్వడం చట్టవిరుద్ధంగా కనిపిస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్పై తదుపరి విచారణను అక్టోబరు 18కి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా