Telangana news: వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించిన ఇంటర్ బోర్డు
ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆలస్య రుసుముతో డిసెంబరు 22 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది.
హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా ఈనెల 14 నుంచి 30 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు తెలిపింది. ఆలస్య రుసుము రూ.100 చెల్లించి డిసెంబరు 2 నుంచి 6వరకు, రూ.500 చెల్లించి డిసెంబరు 8 నుంచి 12 వరకు, రూ.వెయ్యి ఆలస్య రుసుముతో డిసెంబరు 14 నుంచి 17 వరకు, రూ.2వేలు చెల్లించి డిసెంబరు 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు వెల్లడించింది. మొదటి, రెండో సంవత్సరం ఆర్ట్స్ విద్యార్థులు రూ.500, మొదటి సంవత్సరం ఒకేషనల్, రెండో సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు రూ.710 ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!