వరంగల్ నగరంలో ఆక్రమణలు తొలగిస్తాం: కేటీఆర్
భారీ వర్షాలకు అతలాకుతలమైన వరంగల్ నగరంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు పర్యటించారు.
వరంగల్: భారీ వర్షాలకు అతలాకుతలమైన వరంగల్ నగరంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు పర్యటించారు. కేటీఆర్తో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వరంగల్కు చేరుకున్నారు. జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో బస్సులో పర్యటించారు.
తొలుత నయీంనగర్ నాలాను మంత్రులు సందర్శించారు. స్థానికులను మంత్రి కేటీఆర్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద వల్ల తీవ్రంగా నష్టపోయామని ఈ సందర్భంగా బాధితులు వాపోయారు. ఇళ్లల్లో బియ్యం, నిత్యవసర వస్తువులు, దుస్తులు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో వరద ముప్పు లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని, డ్రైనేజీ నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. వరంగల్ నగరంలో ఆక్రమణలు తొలగిస్తామని.. స్థానికులు సహకరించాలని కోరారు. భోజన విరామం తర్వాత నిట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. అంతకు ముందు విహంగ వీక్షణం ద్వారా ఓరుగల్లు నగరాన్ని కేటీఆర్ పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్