TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిన్న 37 మంది నిందితులను అధికారులు డిబార్ చేయగా.. ఇవాళ మరో 13 మంది డిబార్ చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 50 మంది డిబార్ అయ్యారు.

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్ అయ్యారు. భవిష్యత్లో నిర్వహించే పరీక్షలు రాయకుండా వీరిని డిబార్ చేయాలని కమిషన్ నిర్ణయించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. సిట్ ఇప్పటివరకు అరెస్ట్ చేసిన 37 మందిని మంగళవారం డిబార్ చేసింది. తమ నోటిఫికేషన్లోని నిబంధనలను అనుసరించి లీకేజీ కేసులో ప్రమేయమున్న వారు భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 50 మంది డిబార్ అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Justice Lakshmana Reddy: జస్టిస్ లక్ష్మణరెడ్డి అరుదైన రికార్డు
-
మీ వాళ్లు కబ్జా చేస్తే.. మీరు సెటిల్మెంట్ చేశారు: ఆదోని ఎమ్మెల్యే కుమారుడిని చుట్టుముట్టిన జనం
-
‘భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఏం చేశారు?’
-
AP News: హోం మంత్రి వస్తే ఊరొదిలి వెళ్లాలా?
-
పాపికొండల యాత్ర ప్రారంభం
-
నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్