TSPSC: గ్రూప్-4 దరఖాస్తులపై గందరగోళం.. స్పష్టత ఇవ్వని టీఎస్పీఎస్సీ
తెలంగాణలో 9,168 గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ఇవాళ ప్రారంభంకావాల్సి ఉంది. అయితే, ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ మొదలుకాకపోవడంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియపై ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. డిసెంబరు 23 నుంచే దరఖాస్తులు స్వీకరిస్తామని తొలుత నోటిఫికేషన్లో పేర్కొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ).. సాంకేతిక కారణాలతో దరఖాస్తుల స్వీకరణ తేదీని 30కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇవాళ ఉదయం నుంచి గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఎక్కడా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన లింక్ కనిపించకపోవడంతో అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియపై ఇప్పటికీ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఎలాంటి స్పష్టత, సమాచారం ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట