TSPSC paper leak: సిట్‌ విచారణకు హాజరైన టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి,  ఐఏఎస్‌ అధికారి అనితా రామచంద్రన్‌ ఈరోజు విచారణకు హాజరుకావాలని 160సీఆర్పీసీ కింద సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Updated : 01 Apr 2023 13:23 IST

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి,  ఐఏఎస్‌ అధికారి అనితా రామచంద్రన్‌ ఈరోజు విచారణకు హాజరుకావాలని 160సీఆర్పీసీ కింద సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అనితా రామచంద్రన్ సిట్ కార్యాలయానికి చేరుకొని విచారణకు హాజరయ్యారు.ఆమె వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేస్తున్నారు.

ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌.. అనితా రామచంద్రన్‌ వద్ద పీఏగా పని చేశారు. దీంతో ప్రవీణ్‌ గురించి అనితా రామచంద్రన్‌ను సిట్‌ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాల తయారీ, భద్రత, ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన వివరాలను సైతం సిట్‌ అడగనున్నట్లు సమాచారం. 

గ్రూప్‌-1 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి వందకు పైగా మార్కులు సాధించిన వారిలో ఇప్పటివరకు వంద మందిని సిట్‌ అధికారులు విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. మిగిలిన 21 మందిని రెండు మూడు రోజుల్లో ప్రశ్నించనున్నారు. ఇప్పటివరకు ప్రశ్నపత్రం లీక్‌ చేసిన ప్రవీణ్‌, రాజశేఖర్‌, వాటి ద్వారా పరీక్షలు రాసిన వారు సహా మొత్తం 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని