TSRTC: ఆర్టీసీ ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ఛార్జీల మోత
తెలంగాణ ఆర్టీసీ(టీఎస్ఆర్టీసీ) బస్సు ఛార్జీలను పెంచింది. ప్యాసింజర్ సెస్ పేరుతో ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ(టీఎస్ఆర్టీసీ) బస్సు ఛార్జీలను పెంచింది. ప్యాసింజర్ సెస్ పేరుతో ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 చొప్పున.. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10వరకు టికెట్ రేట్లు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. మరోవైపు అకస్మాత్తుగా ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల రౌండప్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు పేర్కొన్న ఆర్టీసీ.. పల్లెవెలుగు బస్సు టికెట్ ధరల్లో దాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. చిల్లర సమస్య కారణంగా టికెట్ రేట్లను రౌండప్ చేసినట్లు తెలిపింది. రూ.12 ఛార్జీ ఉన్న చోట టికెట్ ధర రూ.10గా, రూ.13, రూ.14 ఉన్న టికెట్ ఛార్జీని రూ.15గా చేస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!