Telangana news: బొప్పాయి పండ్లు ఇవ్వలేదని బస్సు ఎక్కించుకోకపోవడం అవాస్తవం!
బొప్పాయి పండ్లు ఉచితంగా ఇవ్వనందుకు ఆర్టీసీ డ్రైవర్ బస్సు ఎక్కించుకోలేదని ఓ రైతు ఆందోళన చేసినట్లు ప్రసార మాద్యమాల్లో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ..
వైరల్గా మారిన రైతు ఆందోళన.. వివరణ ఇచ్చిన ఆర్టీసీ
నాగర్కర్నూల్: బొప్పాయి పండ్లు ఉచితంగా ఇవ్వనందుకు ఆర్టీసీ బస్సు ఎక్కించుకోలేదని ఓ రైతు ఆందోళన చేసినట్లు ప్రసార మాధ్యమాల్లో వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం మారేడు దిన్నె గ్రామం సమీపంలో జరిగిందని, ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, ఇదంతా అవాస్తవమని, గోపయ్య అనే రైతు ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా ప్రచారం చేశాడని అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ వివరణ ఇచ్చారు.
‘‘సదరు వ్యక్తి రోజూ ఆర్టీసీ బస్సులో కొల్లాపూర్కు బొప్పాయి పండ్లు తీసుకెళ్లడం వాస్తవం. శుక్రవారం కూడా పండ్ల పెట్టెలు బస్సులో వేస్తూ, తనకు రావడానికి కుదరదని, కొల్లాపూర్లో తన వాళ్లు దించుకుంటారని చెప్పాడు. అందుకు బస్సు సిబ్బంది ఒప్పుకోలేదు. మనిషి వెంట వస్తేనే సరకును అనుమతించాలి, లేదంటే కార్గో ద్వారానే రవాణా చేసుకోవాలని చెప్పారు. దీంతో గోపయ్య కావాలనే లోకల్ మీడియాలో ప్రచారం చేయించారు. బొప్పాయి పండ్లు ఇవ్వలేదని డ్రైవర్ తిరస్కరించారనడం పూర్తిగా అవాస్తవం’’ అని డిపోమేనేజర్ తెలిపారు.
ఇంతకీ ఏం జరిగింది!
మారేడు మాన్ దిన్నె.. నల్లమల అడవి సమీపంలోని మారుమూల గ్రామం. కేవలం ఒకే ఒక్క బస్సు వెళుతుంది. ఆ గ్రామానికి చెందిన రైతు గోపయ్య తన వ్యవసాయ పొలంలో పండించిన బొప్పాయి పండ్లను నిత్యం కొల్లాపూర్ పట్టణానికి బస్సులో తీసుకువెళ్లి, అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. రోజూలాగానే శుక్రవారం బొప్పాయి పండ్లను బస్సులో తీసుకువెళ్లేందుకు రోడ్డుపై పెట్టగా.. డ్రైవర్ ఎక్కించుకోలేదు. దీంతో గోపయ్య ఆ బస్సు కొల్లాపూర్ నుండి తిరిగి గ్రామానికి వస్తున్న సమయంలో రోడ్డుపై బొప్పాయి పండ్లతోపాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి