ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్ 

ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ సజ్జనార్ క్షేత్రస్థాయి పరిస్థితులపై దృష్టిసారించారు. సంస్థ పనితీరు, సిబ్బంది సహకారం, బస్సుల సమయపాలన, ప్రయాణికుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.

Published : 06 Nov 2021 15:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ సజ్జనార్ క్షేత్రస్థాయి పరిస్థితులపై దృష్టిసారించారు. సంస్థ పనితీరు, సిబ్బంది సహకారం, బస్సుల సమయపాలన, ప్రయాణికుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయానికి బస్సులో వెళ్లిన సజ్జనార్.. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి నల్గొండకు బస్సులో ప్రయాణించారు. నల్గొండ బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ప్రయాణికులతో మాట్లాడారు. వారి సూచలు, సలహాలు స్వీకరించారు. మరో బస్సులో మిర్యాలగూడ బస్ స్టేషన్‌కు వెళ్లారు. ప్రయాణికులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ట్విటర్ ద్వారా అభిప్రాయాలు తెలపాలని సజ్జనార్ సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని