AP news: అన్నమయ్యను అగౌరవపరుస్తున్నారంటూ తితిదేపై దుష్ప్రచారం: అదనపు ఈఓ ధర్మారెడ్డి

అన్నమయ్యను అగౌరవపరుస్తున్నారంటూ తితిదేపై దుష్ప్రచారం చేస్తున్నారని అదనపు ఈఓ ధర్మారెడ్డి అన్నారు. అన్నమయ్య వంశీకులకు శ్రీవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా

Published : 12 Apr 2022 01:27 IST

తిరుమల: అన్నమయ్యను అగౌరవపరుస్తున్నారంటూ తితిదేపై దుష్ప్రచారం చేస్తున్నారని అదనపు ఈఓ ధర్మారెడ్డి అన్నారు. అన్నమయ్య వంశీకులకు శ్రీవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా వస్తున్న గౌరవ మర్యాదలు కల్పిస్తున్నట్లు చెప్పారు. శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ, కల్యాణోత్సవం, ఏకాంత సేవ కార్యక్రమాల్లో అన్నమయ్య వంశీకులు పాల్గొంటున్నారని తెలిపారు. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా నాలుగు మాడ వీధుల్లో మఠాలతోపాటు స్థానికుల నివాసాలను తొలగించామని.. అయితే.. వారికి ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో పునరావాసం కల్పించినట్లు పేర్కొన్నారు. ‘45 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అన్నమయ్య ప్రాజెక్టుకు ఏటా రూ.25 కోట్లు కేటాయిస్తున్నాం. ప్రస్తుతం 14,900 అన్నమయ్య కీర్తనలు అందుబాటులో ఉన్నాయి. 25 మంది పండితులతో వాటిపై పరిశోధన నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 4,400 కీర్తనలను స్వరపర్చగా.. మరో వెయ్యి కీర్తనలను స్వరపర్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఏటా అన్నమయ్య సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. తాళ్లపాకలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ప్రభుత్వం నూతన జిల్లా పేరును అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసింది’ అని చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని