TTD: తితిదే ఫిక్స్డ్ డిపాజిట్లపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: ఈవో ధర్మారెడ్డి
తిరుమల శ్రీవారికి సంబంధించి మొత్తం రూ.15,900 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు వివిధ జాతీయ బ్యాంకుల్లో ఉన్నాయని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. హిందూ మత వ్యతిరేకులు తితిదేపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
తిరుమల: సామాజిక మాధ్యమాల్లో తితిదేకి సంబంధించి కాలపరిమితి ముగిసిన రూ.5వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను రాష్ట్ర ప్రభుత్వం బాండ్స్ రూపంలో డిపాజిట్ చేస్తున్నట్టు వస్తోన్న వార్తలు అవాస్తవమని తితిదే ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో మాట్లాడిన తర్వాత ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. జాతీయ బ్యాంకుల్లో మాత్రమే తితిదే ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుందని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు ఈవో వెల్లడించారు.
తితిదే పిక్స్డ్ డిపాజిట్ల విషయంలో ఎలాంటి వదంతులు నమ్మవద్దన్నారు. తిరుమల శ్రీవారికి సంబంధించి మొత్తం రూ.15,900 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు వివిధ జాతీయ బ్యాంకుల్లో ఉన్నాయన్నారు. హిందూ మత వ్యతిరేకులు తితిదేపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 8గంటల నుంచి ప్రారంభమవుతుందని, దీని వల్ల డిసెంబరు నెల రూ.300 దర్శనం కోటా జాప్యం జరిగిందన్నారు. తిరుపతిలో ఇస్తున్న శ్రీవారి ఉచిత సమయ నిర్దేశిత దర్శన (ఎస్ఎస్డీ) టోకెన్లు ఇంకా పెంచాలని చాలా మంది భక్తులు కోరారన్నారు. శ్రీవారి ఆలయంలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం వచ్చే పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!