TTD: తిరుమలలో తొలిసారి హనుమజ్జయంతి ఉత్సవాలు.. తేదీలు ఖరారు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో తొలిసారి హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఉత్సవాల
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో తొలిసారి హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఉత్సవాల ఏర్పాట్లపై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25 నుంచి 29 వరకు హనుమజ్జయంతి ఉత్సవాలను తిరుమలలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అంజనాద్రి జాపాలి, నాదనీరాజన వేదిక, వేదపాఠశాలలో ఉత్సవాలు జరగనున్నట్లు చెప్పారు. మే 29న ధర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించేందుకు ఆయా విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవాలు మొదటిసారి నిర్వహిస్తున్నందున ఘనంగా జరపాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు జరుగుతున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తుల కార్యక్రమాలను వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీ నాలుగు ఛానెళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు.
అలా తిరుమలకు రావొద్దు.. భక్తులకు తితిదే విజ్ఞప్తి..
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వారి వాహనాలకు వ్యక్తుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, అన్యమత చిహ్నాలతో తిరుమలకు రావొద్దని తితిదే విజ్ఞప్తి చేసింది. అలాంటి వాహనాలను అలిపిరి వద్దే నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఈ విధానాన్ని తితిదే ఎన్నో దశాబ్దాలుగా అనుసరిస్తుందని పేర్కొంది. అయితే ఈ మధ్యకాలంలో అవగాహనలేమితో వారి వాహనాలపై వ్యక్తుల ఫొటోలు, పార్టీ జెండాలు, అన్యమత చిహ్నాలతో వస్తున్నారని వెల్లడించింది. వాహనదారులకు విషయం వివరించి విజిలెన్స్ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారని పేర్కొంది. ఇకపై వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా తితిదే విజ్ఞప్తి చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి