రాష్ట్రాలకు 20 వేల బస్సులు.. తెలంగాణకు దక్కేవెన్నో?
కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలకు 20వేల బస్సులు అందజేయాలని కేంద్రం తాజా బడ్జెటులో ప్రతిపాదించింది. ప్రభుత్వ-ప్రైవేటు
ఈనాడు, హైదరాబాద్: కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలకు 20వేల బస్సులు అందజేయాలని కేంద్రం తాజా బడ్జెటులో ప్రతిపాదించింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో వాటిని కేటాయించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ఉపాధి కల్పనతో పాటు ప్రైవేటు పెట్టుబడిదారులను రవాణా రంగంలో మరింతగా భాగస్వాములను చేసేందుకు ఈ పథకం ఉపకరిస్తుందన్నది కేంద్రం వ్యూహం. ఆ 20వేల బస్సులను ఏయే రాష్ట్రాలకు ఎన్నేసి కేటాయించేదీ, వాటిలో తెలంగాణకు ఎన్ని దక్కేదీ స్పష్టత లేదు. ఫెమా ప్రాజెక్టు కింద కేంద్రం రాష్ట్రాలకు ఇప్పటికే విద్యుత్తు బస్సులను కేటాయించింది. వాటిని ప్రైవేటు సంస్థల నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకున్నట్లు పేర్కొంది. ఫెమా-2 పథకం కింద కూడా రాష్ట్రానికి బస్సులను కేటాయించినా అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మెతో ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. ఈ క్రమంలో పథకాన్ని ద్వితీయ శ్రేణి నగరాలైన ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్లలో వినియోగించుకునేందుకు అవకాశం లేకపోలేదని ఆర్టీసీ అధికారి ఒకరు సోమవారం ‘ఈనాడు’తో చెప్పారు. ఈ బస్సులకు సంబంధించిన విధివిధానాలను కేంద్రం ఖరారు చేస్తే స్పష్టత వస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్