పేకమేడలా కూలిన రెండంతస్తుల భవనం

బిహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో రెండంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. అప్పటికే భవనంలోని వారంతా బయటకు వచ్చేయటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Updated : 28 May 2021 05:48 IST

పాట్నా: బిహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో రెండంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. అప్పటికే భవనంలోని వారంతా బయటకు వచ్చేయటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ భవనం ముఖ్దంపూర్ మార్కెట్ రోడ్డుకు ఆనుకుని ఉండగా, ప్రమాద సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అయినప్పటికీ కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ అమలు చేస్తుండటం వల్ల ప్రాణనష్టం తప్పింది. భవనం పునాది బలహీనంగా ఉండటం వల్లే ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు