మర్చిపోయిన కూరగాయల్ని పరిచయం చేస్తున్నాడు
కాలంతోపాటు మనం జీవనశైలీలోనూ ఎన్నో మార్పులొచ్చాయి. విదేశీ పిజ్జాలు, బర్గర్లు మన ఆహార అలవాట్లలో భాగమైమయ్యాయి. దీంతో మన సంప్రదాయ కూరగాయాల వంటల రుచి ఇప్పటి యువతకు పెద్దగా నచ్చట్లేదు. ప్రస్తుతం మార్కెట్కు వెళ్తే దొండకాయ, వంకాయ, టమాట, బెండకాయ, క్యాబేజీ ఇలా మహా
కాలంతోపాటు మనం జీవనశైలిలోనూ ఎన్నో మార్పులొచ్చాయి. విదేశీ పిజ్జాలు, బర్గర్లు మన ఆహార అలవాట్లలో భాగమైమయ్యాయి. దీంతో మన సంప్రదాయ కూరగాయల వంటల రుచి ఇప్పటి యువతకు పెద్దగా నచ్చట్లేదు. ప్రస్తుతం మార్కెట్కు వెళ్తే దొండకాయ, వంకాయ, టమాట, బెండకాయ, క్యాబేజీ ఇలా మహా అయితే ఓ 20 రకాల కూరగాయాలు ఉండొచ్చు. పూర్వం ఇవే కాదు.. మరెన్నో కూరగాయాలుండేవి. కానీ కాలక్రమంలో మనం చాలా వాటిని నిర్లక్ష్యం చేశాం. మన పూర్వీకులు వండిన వంటలను మర్చిపోయాం. ఇలా అంతరించిపోతున్న కూరగాయలు, మర్చిపోయిన వంటలను తమిళనాడుకు చెందిన ఓ యువకుడు ఇప్పుడు వెలికితీస్తున్నాడు. బామ్మల కాలం నాటి వంటలను మళ్లీ మనకు పరిచయం చేస్తున్నాడు.
చెన్నైలో ఉండే పాతికేళ్ల ఆకాశ్ మురళీధరన్ ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేసి.. ఆ తర్వాత వంటలపై ఆసక్తితో ఇటలీలో ఫుడ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్లో మాస్టర్ డిగ్రీ చేశాడు. ఇంటర్న్షిప్ పూర్తి చేసుకొని చెన్నైకి తిరిగొచ్చాడు. ఓ రోజు ఇల్లు శుభ్రం చేస్తుండగా ఆకాశ్ బామ్మ చేసే వంటల రెసిపీ నోట్బుక్ ఒకటి కంటపడింది. అందులో ఎప్పుడూ తను తినని, వినని కూరగాయలు, వంటల పేర్లు ఉండటం చేసి ఆకాశ్ ఆశ్చర్యపోయాడు. వాటిపై మరింత ఆసక్తి కలగడంతో దక్షిణ భారతంలో అంతరించిపోతున్న కూరగాయలపై పరిశోధన చేయాలని, వాటితో చేసే వంటలను అందరికి పరిచయం చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా ‘‘100 డేస్ ఆప్ కుకింగ్’ ప్రాజెక్టు చేపట్టాడు. ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా వంద రోజుల్లో వంద రకాల దక్షిణ భారత కూరగాయాలను నెటిజన్లకు పరిచయం చేయడంతో పాటు వాటిని ఎలా వండాలో తెలిపే నోట్ను పోస్టు చేశాడు.
‘‘మా బామ్మకు చెందిన నోట్బుక్లో తుమ్మకుట్టై అనే కూరగాయ పేరు చూశా. అది దోసకాయలాగే ఉంటుంది. దాని గురించి నా స్నేహితులను అడిగితే ఎవరూ ఆ పేరే వినలేదన్నారు. మార్కెట్లలో కూడా లభించలేదు. అన్ని మార్కెట్లు గాలిస్తే ఒక చోట లభించింది’’అని ఆకాశ్ చెప్పుకొచ్చాడు. చిన్నతనంలో తను ఎక్కువగా వంటగదిలోనే ఎక్కువ సమయం గడిపేవాడట. తన బామ్మ చేసే వంటకాలను ఆసక్తిగా గమనించేవాడట. ఇప్పుడు 100 డేస్ ఆఫ్ కుకింగ్ ప్రాజెక్టు చేయడానికి తన బామ్మే స్ఫూర్తి అని ఆకాశ్ అంటున్నాడు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత