Accident: ఇక నుంచి అక్కడ రోడ్డు ప్రమాదాల ఫొటోలు.. వీడియోలు తీస్తే జైలుకే

ప్రస్తుత కాలంలో వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతూ ఎంతోమంది తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. కొన్నిసార్లు మనం చూస్తుండగానే ప్రమాదాలు జరుగుతుంటాయి.

Published : 04 Mar 2022 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత కాలంలో వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతూ ఎంతోమంది తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. కొన్నిసార్లు మనం చూస్తుండగానే ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో క్షతగాత్రులకు సహాయం చేయడటానికి బదులు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటారు. అయితే ఈ అంశంపై యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది. 

రోడ్డు ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన వారి ఫొటోలుగానీ, వీడియోలుగానీ చిత్రీకరిస్తే కఠినంగా శిక్షించేందుకు వీలుగా సైబర్‌ క్రైమ్‌ చట్టాన్ని యూఏఈ సవరించింది.  సవరించిన చట్టం ప్రకారం యూఏఈలో ఇకపై ఎవరైనా ప్రమాద బాధితుల చిత్రాలు, వీడియోలు తీస్తే ఆరు నెలల జైలు లేదా రూ.31 లక్షల నుంచి  రూ.కోటి వరకు జరిమానా.. ఒక్కోసారి రెండింటిని విధిస్తారు. రోడ్డు ప్రమాద బాధితుల గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు ఈ చట్టాన్ని తీసుకువచ్చామని యూఏఈ పేర్కొంది. ఈ చట్టం జనవరి 2, 2002 నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. సాక్ష్యాల సేకరణలో అధికారులకు మినహాయింపు ఉంటుందని వివరించింది. అంతేకాకుండా అనుమతి లేకుండా ఇతరుల ఫొటోలు, వీడియోలు తీయడం, ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేసి అప్రతిష్ఠ పాలు చేస్తే నేరంగా పరిగణిస్తూ చట్టాలను కఠినతరం చేసింది. ఇలాంటి  చర్యలకు పాల్పడితే కనీసం ఏడాది జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు జరిమానా విధించేవిధంగా చట్టాల్లో మార్పులు చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని