Tamilisai Soundararajan: రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు.. హాజరైన రాజకీయ ప్రముఖులు

తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శ్రీశుభకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరూ ఉగాది పండుగను ఉత్సాహంగా, ఆనందంగా

Published : 02 Apr 2022 01:37 IST

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శ్రీశుభకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరూ ఉగాది పండుగను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీశుభకృత్ నామ సంవత్సరం తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని.. ఆ వెలుగు ప్రజలకు శుభప్రదంగా, సంతోషమయంగా ఉండాలని కోరుకున్నారు. తెలుగు వారికి ప్రత్యేకమైన ఉగాది పండుగను కుటుంబసభ్యులతో కలిసి అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు.

రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. రాజ్‌భవన్‌లో వేడుకలకు సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు గైర్హాజరయ్యారు. ఉగాది వేడుకలకు రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌,  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి వేడుకలకు హాజరయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని