Ugadi 2022: చిలకమర్తి వారి శుభకృత్ నామ ఉగాది పంచాంగ శ్రవణం.. వీక్షించండి
ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ అనేకమంది ఏదైనా ముఖ్య కార్యాన్ని తలపెట్టాలంటే ముందుగా శుభ ముహూర్తం చూసుకుంటారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న జ్యోతిష్యులు, పంచాంగకర్తలను.......
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ అనేకమంది ఏదైనా ముఖ్య కార్యాన్ని తలపెట్టాలంటే ముందుగా శుభ ముహూర్తం చూసుకుంటారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న జ్యోతిష్యులు, పంచాంగ కర్తలను సంప్రదిస్తుంటారు. ముహూర్త బలానికి ఉన్న క్రేజ్తో వారికి మంచి పరపతి లభిస్తోంది. ఈ క్రమంలో తెలుగుతో పాటు వివిధ భాషల్లో కూడా పంచాంగాలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన యువ ఇంజినీర్, ప్రముఖ పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తొలిసారిగా తెలుగు, ఆంగ్ల భాషల్లో దక్షిణ భారతదేశ ఆంగ్ల పంచాంగాన్ని రూపొందించి ప్రత్యేకంగా నిలిచారు. ఆంగ్ల పంచాంగం ప్రత్యేకించి నేటి తరానికి బాగా ఉపయోగపడుతుందని చిలకమర్తి తెలిపారు. పంచాంగం చదవడం ఓ కళ అని, దక్షిణ భారత ఆంగ్ల పంచాంగం... సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కొత్తగా చేరే వారికి, విదేశీ ప్రయాణాలకు, గృహ ప్రవేశాలకు మహూర్తబలం చూసుకునేందుకు మంచి ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
హరిద్వార్, రిషికేష్ బద్రీనాథ్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించినప్పుడు విదేశీయులు మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల చూపిన ఆసక్తి, విదేశాల్లో ఉన్న భారతీయులను దృష్టిలో ఉంచుకుని మన సనాతన ధర్మంలో ఉన్న విషయాల్ని తెలియజేయాలనే సంకల్పంతో ఆంగ్లం, తెలుగులో పంచాంగాలు తీసుకొచ్చినట్టు వివరించారు. ఓ వైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే... జ్యోతిష్యం, వాస్తు, నదులు-పుష్కరాలు, యాత్రలు, పూజా విధానంపై చిలకమర్తి అనేక పుస్తకాలు రాశారు. వీటిని www.chilakamarthi.com, www.southindianastrology.org నుంచి ఉచితంగా పొందొచ్చని తెలిపారు. చిలకమర్తి ఆధ్యాత్మిక కృషిని గుర్తించిన తిరుమల పీఠం... ‘జ్యోతిష్య మార్తాండ’, ‘వాస్తు విద్యా విశారద’ బిరుదులు ప్రదానం చేసింది. దేశంలోని ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక విషయాలపై రచనలు, ప్రవచనాల ద్వారా చేసిన కృషికి రాజమహేంద్రవరంలో జరిగిన సాంస్కృతిక మహోత్సవాల్లో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. చిలకమర్తి సేవలకు ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అవార్డుతో సత్కరించారు. విదేశాల్లో జరిగిన పలు ఉగాది వేడుకల్లో ఆయన్ను పురస్కారాలతో సత్కరించారు. శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి ‘ఈటీవీ వార్తా ఛానెళ్ల’లో చేసిన పంచాంగ శ్రవణం వీక్షించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్