Nirmala Sitharaman: ప్రసంగం మధ్యలో మంచినీళ్ల సీసా అందించిన నిర్మలా సీతారామన్.. వీడియో వైరల్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన హోదాను పక్కన పెట్టీ మరీ ఓ కార్యక్రమంలో ఎన్ఎస్డీఎల్ ఎండీకి ప్రసంగం మధ్యలో మంచినీళ్ల సీసా అందించి ప్రశంసలు అందుకుంటున్నారు.
ముంబయి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన హోదాను పక్కన పెట్టీ మరీ ఓ కార్యక్రమంలో ఎన్ఎస్డీఎల్ ఎండీకి ప్రసంగం మధ్యలో మంచినీళ్ల సీసా అందించి ప్రశంసలు అందుకుంటున్నారు. నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) సిల్వర్జూబ్లీ వేడుకల్లో భాగంగా ముంబయిలోని ఓ హోటల్లో విద్యార్థుల కోసం పెట్టుబడి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారి గురించి ఎన్ఎస్డీఎల్ ఎండీ పద్మజ చుండూరు మాట్లాడుతున్నారు. ప్రసంగం మధ్యలో మంచినీళ్ల కోసం ఆమె హోటల్ సిబ్బందిని అడిగారు. దీంతో వేదికపైనే ఉన్న నిర్మలా సీతారామన్ వెంటనే తన కుర్చీ నుంచి లేచి ఆమె దగ్గరికి వెళ్లి గ్లాస్తో పాటు మంచినీళ్ల బాటిల్ను అందించారు . దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన వారు నిర్మలా సీతారామన్ విశాల హృదయాన్ని అభినందిస్తూ చప్పట్లతో ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా నిర్మల సీతారామన్ను కొనియాడుతున్నారు.
‘‘ఇది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాల హృదయం, వినయం, విలువలను ప్రతిబింబిస్తుంది’’ అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. ‘‘ఇది ఎంత అద్భుతమైన సంఘటన. మీ వినయాన్ని ఎంతో గౌరవిస్తున్నాను మేడమ్’’ అంటూ నిప్పాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో సందీప్ సిక్కా ట్వటర్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ