Hyderabad: అంబులెన్స్ నడిపిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.. వీడియో

కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అంబులెన్స్‌ నడిపారు. హైదరాబాద్‌ తిలక్‌నగర్‌లోని ప్రభుత్వ ఫీవర్‌ ఆస్పత్రికి.....

Published : 04 Oct 2022 01:08 IST

హైదరాబాద్‌: కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అంబులెన్స్‌ నడిపారు. హైదరాబాద్‌ తిలక్‌నగర్‌లోని ప్రభుత్వ ఫీవర్‌ ఆస్పత్రికి ఈసీఐఎల్‌, ఏబీవీ ఫౌండేషన్‌ విరాళంగా అందజేసిన అంబులెన్స్‌ను ప్రారంభించిన సందర్భంగా దాన్ని నడిపి ఆకట్టుకున్నారు. తన నియోజకవర్గమైన సికింద్రాబాద్‌లో ఆరోగ్య వసతులను మెరుగుపరిచేందుకు వీలుగా అధునాతన సదుపాయాలతో కూడిన లైఫ్‌ సపోర్టు  అంబులెన్స్‌ను ఇచ్చినందుకు ఈసీఐఎల్‌, ఏబీవీ ఫౌండేషన్‌కు  కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియోను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని