Samatha Murthy: ముచ్చింతల్‌లో 108 దివ్యదేశాలను దర్శించుకున్న రాజ్‌నాథ్‌సింగ్‌

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో శ్రీరామనుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి.

Updated : 10 Feb 2022 20:12 IST

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో శ్రీరామనుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవమూర్తులతో ప్రధాన యాగశాల నుంచి సమతామూర్తి కేంద్రం వరకు రుత్విజులు శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్ర తర్వాత దివ్యక్షేత్రాల్లోని 20 ఆలయాల్లో విగ్రహాలకు చినజీయర్‌స్వామి, వేదపండితులు ప్రాణప్రతిష్ట చేశారు. ఇప్పటికే శ్రీరామనగరంలోని 32 ఆలయాల్లో ప్రాణప్రతిష్ట పూర్తయింది. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శ్రీరామనగరం విశేషాలను తెలుసుకున్నారు. 108 దివ్య దేశాలను దర్శించుకున్నారు. సమతామూర్తి కేంద్రంలో మొక్కలు నాటిని రాజ్‌నాథ్‌సింగ్‌ ... లక్ష్మీనారాయణ క్రతువులో పాల్గొన్నారు. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రవిశంకర్‌ తదితరులు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని