Beggars: ఈ స్వచ్ఛంద సంస్థ.. యాచకులను వ్యాపారులను చేస్తోంది!
‘యాచకులకు దానం చేయకండి.. వారి నైపుణ్యాలను గుర్తించి వారిపై పెట్టుబడి పెట్టండి’’అంటోంది.. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన ‘కామన్మ్యాన్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ. ఎవరూ పుట్టుకతోనే యాచకులు కారని, వారిని సరైన మార్గంలో నడిపిస్తే వ్యాపారవేత్తలుగా ఎదుగుతారని
ఇంటర్నెట్ డెస్క్: ‘యాచకులకు దానం చేయకండి.. వారి నైపుణ్యాలను గుర్తించి వారిపై పెట్టుబడి పెట్టండి’’ అంటోంది.. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసికి చెందిన ‘కామన్మ్యాన్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ. ఎవరూ పుట్టుకతోనే యాచకులు కారని, వారిని సరైన మార్గంలో నడిపిస్తే వ్యాపారవేత్తలుగా ఎదుగుతారని చెబుతోంది. చెప్పడమే కాదు.. యాచకులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి కల్పిస్తూ వారిని వ్యాపారులుగా మారుస్తోంది.
‘కామన్మ్యాన్ ట్రస్ట్’ను నిర్వహిస్తున్న సామాజిక కార్యకర్త చంద్ర మిశ్ర.. యాచకులను ప్రయోజకులుగా మార్చడమే లక్ష్యంగా గతేడాది ‘బెగ్గర్ కార్పొరేషన్’ పేరుతో స్టార్టప్ను ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా వారణాసిలోని 12 యాచక కుటుంబాల నుంచి 55 మందిని ఎంచుకొని వారికి వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించారు. వారిలో కొందరు వస్త్రం, కాగితాలతో బ్యాగులు తయారు చేయడం నేర్చుకున్నారు. దీంతో వారిని స్వయం సహాయక బృందంగా మార్చి బ్యాగుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయించారు. వారి ఉత్పత్తులు మార్కెట్లో బాగానే అమ్ముడవుతుండటంతో మిశ్రకు తన ఆలోచనపై నమ్మకం పెరిగింది. దీంతో యాచకులందరినీ ఇదే బాటలో నడిపించాలని సంకల్పించారు.
ఓ నివేదిక ప్రకారం భారతీయులు ఏటా రూ.34వేల కోట్లు యాచకులకు దానంగా ఇస్తున్నారట. దానం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని భావించే ఈ విధంగా చేస్తుంటారని, అలా కాకుండా వారిపై పెట్టుబడి పెడితే యాచకుల జీవితాలే మారుతాయని మిశ్ర చెప్పుకొచ్చారు.
ప్రయోగత్మాకంగా ఏర్పాటు చేసిన ‘బెగ్గర్ కార్పొరేషన్’కు ఆదరణ లభిస్తుండటంతో దానిని ఆదాయ వనరున్న కంపెనీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రూ. 2.5కోట్ల పెట్టుబడులు సేకరించేందుకు మిశ్ర ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వం తమకు అనుమతిస్తే.. యాచకులను గుర్తించి.. పిల్లల్ని, వృద్ధుల్ని పునరావాస కేంద్రాలకు పంపించి, 18-45ఏళ్ల వయస్కులకు మూడు నెలలు శిక్షణ ఇచ్చి, రుణాలు ఇప్పించి వ్యాపారం ప్రారంభించేలా చేస్తామని ‘కామన్మ్యాన్ ట్రస్ట్’ నిర్వహకులు అంటున్నారు.
అంతేకాదు, యాచకుల పిల్లలు చదువుకునేందుకు వారణాసిలోనే ‘స్కూల్ ఆఫ్ లైఫ్’ పేరుతో ఓ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 32 మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్