అమెరికా మాజీ అధ్యక్షుడి ‘శాండ్విచ్’కు అరవై ఏళ్లు
ప్రముఖులు ఇచ్చిన ఆటోగ్రాఫ్లు, వారితో దిగిన ఫొటోగ్రాఫ్లను భద్రంగా దాచుకోవడం చూశాం. కానీ, అమెరికాలోని ఇల్లినియస్కు చెందిన స్టీవ్ జెన్నె అనే వ్యక్తి ఆ దేశ మాజీ అధ్యక్షుడు సగం తిని వదిలేసిన శాండ్విచ్ను అరవై ఏళ్లుగా భద్రపరుస్తూ వస్తున్నాడు. ఇటీవల
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖులు ఇచ్చిన ఆటోగ్రాఫ్లు, వారితో దిగిన ఫొటోగ్రాఫ్లను భద్రంగా దాచుకోవడం చూశాం. కానీ, అమెరికాలోని ఇల్లినాయిస్కు చెందిన స్టీవ్ జెన్నె అనే వ్యక్తి ఆ దేశ మాజీ అధ్యక్షుడు సగం తిని వదిలేసిన శాండ్విచ్ను అరవై ఏళ్లుగా భద్రపరుస్తూ వస్తున్నాడు. ఇటీవల ఆ శాండ్విచ్ ఆరు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడి మీడియా అతడిని ఇంటర్వ్యూలు చేస్తుండటంతో ఆ శాండ్విచ్ మరోసారి వైరల్గా మారింది.
(ఫొటో: అమెజాన్.కామ్)
1960 సెప్టెంబర్ 22న అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్.. ఇల్లినాయిస్లోని ఓ ప్రాంతంలో పర్యటనకు వచ్చారట. అప్పుడు స్టీవ్జెన్నె వయసు పద్నాలుగు సంవత్సరాలు. నిక్సన్ రాక నేపథ్యంలో అక్కడి పాఠశాల యాజమాన్యం జెన్నెతోపాటు మరికొందరు విద్యార్థులను పర్యటనలో సహాయకులుగా పంపించింది. మధ్యాహ్నం స్థానిక పార్క్లో నిక్సన్ భోజనం చేశారు. ఆ సమయంలో జెన్నె.. నిక్సన్ వెనుకే నిలబడ్డాడు. నిక్సన్ శాండ్విచ్ తింటూ ఎంతో బాగుందంటూ కామెంట్ చేశారట. సగం శాండ్విచ్ తినేసి.. ప్రసంగం కోసం లేచి వెళ్లిపోయారట. అక్కడే నిల్చున్న జెన్నె వెంటనే మిగిలిన సగం శాండ్విచ్ను తీసుకొని దాచిపెట్టుకున్నాడు. ఇంటికొచ్చాక తన తల్లితో విషయం చెప్పి నిక్సన్ తిని వదిలేసిన సగం శాండ్విచ్ను భద్రపర్చమన్నాడట. అప్పుడు ఆమె శాండ్విచ్ను ఫ్రీజర్లో పెట్టింది. 1969లో నిక్సన్ అమెరికా అధ్యక్షుడయ్యారు. దీంతో దేశాధ్యక్షుడు తిని వదిలేసిన ఈ శాండ్విచ్ను ఎప్పటికీ తనతో ఉంచుకోవాలని జెన్నె భావించాడు. అలా దాన్ని ఫ్రీజర్లో పెట్టి ఆరు దశాబ్దాలుగా భద్రపరుస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆ శాండ్విచ్ కోసమే ప్రత్యేక ఫ్రీజర్ ఏర్పాటు చేసి దానిపై ‘దాచిపెట్టండి.. పారేయొద్దు’అని రాసి పెట్టాడట. ఈ శాండ్విచ్పై జెన్నె ఒక పుస్తకం రాయడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM