భారత్‌ గీతాలకు.. అమెరికా సైనికుల బల్లె బల్లె

అమెరికా, భారత్‌లకు చెందిన సైనికులు చేసిన భారతీయ నాట్యం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

Published : 19 Feb 2021 01:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వసంత పంచమి సందర్భంగా అమెరికా, భారత్‌లకు చెందిన సైనికులు చేసిన భారతీయ నాట్యం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. రాజస్థాన్‌లో ఇరుదేశాలు సంయుక్తంగా ‘యుద్ధ్‌ అభ్యాస్‌’  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చిన వసంత పంచమి పర్వదినం సందర్భంగా జరుపుతున్న వేడుకలకు అమెరికన్‌ సైనికులను ఆహ్వానించారు. వీటిలో హాజరయేందుకు వారు భారత సంప్రదాయ దుస్తులు ధరించి మరీ వచ్చారు. అనంతరం పంజాబీ పాటలకు అనుగుణంగా భారతీయ సైనికులతో కలసి లయబద్ధంగా నాట్యం చేశారు. ఐతే వీరందరూ మాస్కులను ధరించటం మాత్రం మర్చిపోకపోవటం ప్రశంసనీయం.

కాగా  ఈ వేడుగలకు తమను ఆహ్వానించినందుకు అమెరికన్‌ సైనికులు కృతజ్ఞతలు తెలుపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘‘హ్యాపీ బసంత్‌ పంచమి’’  అంటూ అమెరికా రక్షణ సంస్థ బ్యూరో ఆఫ్‌ సౌత్‌ అండ్‌ సెంట్రల్‌ ఆసియన్‌ ఎఫైర్స్‌ తమ అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేశారు. మరి వారి స్టెప్పులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మీరే చూడండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని