Vande Bharat: తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి కానుక.. 15న వందే భారత్ రైలు ప్రారంభం
ఈనెల 15న ఉదయం 10 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్గా వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుక అందజేయనుంది. సికింద్రాబాద్- విశాఖపట్నం మద్య నడవనున్న ‘వందేభారత్ ఎక్స్ప్రెస్’ (Vande Bharat express) రైలు ప్రారంభోత్సవం షెడ్యూల్ మారింది. ఈనెల 19న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వందే భారత్ రైలును మోదీ ప్రారంభిస్తారని తొలుత ప్రకటించారు. కానీ, ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. దీనికితోడు పండుగ సమయంలో తెలుగు ప్రజలకు కానుక ఇచ్చేందుకు నాలుగు రోజుల ముందే ఈరైలును ప్రారంభించనున్నారు. ఈనెల 15న ఉదయం 10 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్గా వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగే కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి పాల్గొంటారని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. దేశంలోని 8వ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరం మీదుగా దాదాపు 8.40గంటల్లో విశాఖపట్నం చేరుకోనుంది.
ముగిసిన ట్రయల్ రన్
తెలుగు రాష్ట్రాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘వందేభారత్ ఎక్స్ప్రెస్’ నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకుంది. పూర్తిగా చైర్ కార్ బోగీలున్న ఈ రైలు అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుందని, అందువల్లే వందే భారత్ రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని, 8.40గంటల్లోనే విశాఖ నుంచి సికింద్రాబాద్ చేరుకుంటుందని విశాఖ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సురేష్ తెలిపారు. రైల్వే స్టేషన్లో అధికారులు పరిశీలించిన తర్వాత రైలును న్యూ కోచ్ కాంప్లెక్స్కు పంపించారు. లోకో పైలెట్ క్యాబిన్కు అనుసంధానంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ రైలు మొత్తం ఉంది. లోకో పైలెట్ ఆధీనంలో కోచ్ల ద్వారాలు తెరుచుకునే, మూసివేసే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల అత్యవసర సహాయం కోసం ద్వారం వద్ద టాక్ బ్యాక్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. విశాలమైన టాయిలెట్ ఈ కోచ్ ప్రత్యేకత.
ఛార్జీలు ఎంతంటే?
వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణ వేళలు, ఛార్జీల వివరాల్ని రైల్వేశాఖ ప్రకటించాల్సి ఉంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి 699 కి.మీ దూరం. దిల్లీ.. జమ్మూలోని కట్రా మధ్య వందేభారత్ నడుస్తోంది. ఈ రెండింటి మధ్య దూరం 655 కి.మీ దూరం.ఛార్జీల్ని పరిశీలిస్తే- ఛైర్కార్ టికెట్ ధర రూ.1,665. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ధర రూ.3,055. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య దూరం ఇంకాస్త ఎక్కువే కావడంతో దిల్లీ-కాట్రా వందేభారత్ ఛార్జీల కంటే కొంచెం ఎక్కువే ఉండే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM