‘పడకల్లేవు.. కాసేపు ఆగండి’.. అంతటా ఇదే దుస్థితి

కరోనా బాధితులు, బంధువులతో ప్రభుత్వ ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఆప్తులను కోల్పోయినవారి ఆవేదనలు, కుటుంబసభ్యుల ఆర్తనాదాలు నిత్యకృత్యమయ్యాయి. తమ కళ్లముందే అయినవారు అనంతలోకాలకు వెళ్లిపోతుంటే ఏమీ చేయలేని దీన స్థితిలో వారు పడే ఆవేదన చూస్తే కళ్లు చెమర్చకమానవు....

Updated : 19 Oct 2022 11:29 IST

ప్రభుత్వాసుపత్రుల వద్ద హృదయవిదారక దృశ్యాలు

అమరావతి: కరోనా బాధితులు, బంధువులతో ప్రభుత్వ ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఆప్తులను కోల్పోయినవారి ఆవేదనలు, కుటుంబసభ్యుల ఆర్తనాదాలు నిత్యకృత్యమయ్యాయి. తమ కళ్లముందే అయినవారు అనంతలోకాలకు వెళ్లిపోతుంటే ఏమీ చేయలేని దీన స్థితిలో వారు పడే ఆవేదన చూస్తే కళ్లు చెమర్చకమానవు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇద్దరు ముగ్గురు రోగులను ఒకే స్ట్రెచర్‌పై కూర్చోబెట్టి తీసుకెళుతున్నారు. స్ట్రెచర్‌లు లేక రోగులు ఇబ్బందులు పడుతుంటే.. సిబ్బంది మాత్రం వాటిపై ఆక్సిజన్‌ సిలిండర్లు తీసుకెళ్లడం అక్కడివారిని బాధించింది. అనేక మంది రోగులు పడకల కోసం ఆంబులెన్స్‌లోనే ఆక్సిజన్‌ సిలిండర్లతో ఎదురుచూస్తున్న దుస్థితి నెలకొంది. రోగులు కన్నీళ్లు పెట్టినా, గగ్గోలు పెట్టినా, ఆర్తనాదాలు చేసినా.. వారికి దొరికే సమాధానం ఒకటే.. ‘పడకల్లేవు. కాసేపు ఆగండి’. ఈ తరహా పరిస్థితులు విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద సర్వసాధారణమయ్యాయి.

రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రి అయిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి దూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వస్తున్నారు. ఇక్కడ కేటాయించిన పడకలు సరిపోక బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోగుల సంఖ్యకు తగినట్లు పడకలు పెంచి ప్రాణాలు కాపాడమని బాధితులు, వారి కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని