నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి: వీహెచ్పీ
విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముని విగ్రహం ధ్వంసం ఘటనను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) తీవ్రంగా ఖండించింది.
అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముని విగ్రహం ధ్వంసం ఘటనను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలకు వెంటనే తగిన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. దేవాలయాల పరిరక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతున్నట్లు కనిపిస్తోందని విమర్శించింది. ఈ మేరకు వీహెచ్పీ ప్రధాన కార్యదర్శి మిలింద్ పాండే ఓ ప్రకటన విడుదల చేశారు.
గత రెండు రోజుల్లో ఏపీలోని మూడు ఆలయాలపై దాడులు జరిగాయని.. జగన్ ప్రభుత్వం ఉదాసీనతతోనే హిందూ దేవాలయాలపై దాడులు పునరావృతం అవుతున్నాయని వీహెచ్పీ ఆరోపించింది. దాడులకు పాల్పడిన వారిపై ఇప్పటివరకు ఎటువంటి శిక్షా లేదని ఆక్షేపించింది. దురాగతాలకు వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపునివ్వడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని పేర్కొంది. నిందితులపై సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి..
విదేశీ సంస్థలకు కొవాగ్జిన్ ఏమాత్రం తీసిపోదు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు