నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి: వీహెచ్‌పీ

విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముని విగ్రహం ధ్వంసం ఘటనను విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) తీవ్రంగా ఖండించింది.

Published : 05 Jan 2021 02:25 IST

అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముని విగ్రహం ధ్వంసం ఘటనను విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలకు వెంటనే తగిన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. దేవాలయాల పరిరక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతున్నట్లు కనిపిస్తోందని విమర్శించింది. ఈ మేరకు వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి మిలింద్‌ పాండే ఓ ప్రకటన విడుదల చేశారు. 

గత రెండు రోజుల్లో ఏపీలోని మూడు ఆలయాలపై దాడులు జరిగాయని.. జగన్ ప్రభుత్వం ఉదాసీనతతోనే హిందూ దేవాలయాలపై దాడులు పునరావృతం అవుతున్నాయని వీహెచ్‌పీ ఆరోపించింది. దాడులకు పాల్పడిన వారిపై ఇప్పటివరకు ఎటువంటి శిక్షా లేదని ఆక్షేపించింది. దురాగతాలకు వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపునివ్వడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని పేర్కొంది. నిందితులపై సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ డిమాండ్‌ చేసింది.  

ఇదీ చదవండి..

విదేశీ సంస్థలకు కొవాగ్జిన్‌ ఏమాత్రం తీసిపోదు

 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని