వ్యవసాయం వల్లే దేశం కోలుకుంది: ఉపరాష్ట్రపతి

కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుందంటే అందుకు వ్యవసాయ రంగమే కారణమని ఉపరాష్ట్రపతి

Updated : 31 Mar 2021 15:29 IST

హైదరాబాద్‌: కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుందంటే అందుకు వ్యవసాయ రంగమే కారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. రైతులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ జాబితాలో చేర్చాలని సూచించారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో విశ్రాంత ఐఏఎస్‌ మోహన్‌కందా రాసిన ‘‘భారత్‌లో వ్యవసాయం.. రైతుల  ఆదాయం రెట్టింపులో సవాళ్లు’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య పాల్గొన్నారు. వ్యవసాయం చేసే వారి సంఖ్య తగ్గుతోందని.. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని వెంకయ్య నాయుడు సూచించారు. 

‘‘దేశంలో సగం మందికి పైగా వ్యవసాయమే ఆధారం. సాగు లాభసాటిగా లేకపోవడంతో వ్యవసాయాన్ని వీడుతున్నారు. కొవిడ్‌ వల్ల అన్ని రంగాలు దెబ్బతింటే వ్యవసాయం తట్టుకొని నిలబడింది. కరోనా వల్ల పౌష్టికాహారంపై శ్రద్ధ పెరిగింది. గిట్టుబాటు ధరలు కల్పిస్తే రుణమాఫీ అవసరం లేదు’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని