కోర్టుల్లోనూ మాతృభాషకు ప్రాధాన్యం పెరగాలి: వెంకయ్యనాయుడు

మాతృభాష సంరక్షణకు సృజనాత్మక విధానాలపై దృష్టి సారించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు కూటమి సంస్థ నిర్వహించిన భాషాభిమానుల..

Updated : 31 Jul 2021 20:02 IST

హైదరాబాద్‌: మాతృభాష సంరక్షణకు సృజనాత్మక విధానాలపై దృష్టి సారించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు కూటమి సంస్థ నిర్వహించిన భాషాభిమానుల  అంతర్జాల సదస్సులో ఉప రాష్ట్రపతి ప్రసంగించారు. వివిధ దేశాల నుంచి వెయ్యిమందికి పైగా తెలుగు భాషాభిమానులు, భాషావేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. మాతృభాష పరిరక్షణకు ప్రాథమిక విద్య మాతృభాషలోనే సాగాలని, పరిపాలనలోనూ మాతృభాష ప్రస్పుటించాలని ఆకాంక్షించారు. కోర్టుల్లోనూ మాతృభాషకు ప్రాధాన్యం పెరగాలని, సాంకేతిక విద్యలోనూ పెద్దపీట వేయాలన్న ఉప రాష్ట్రపతి  .. కుటుంబ సభ్యులు తెలుగులోనే మాట్లాడుకోవాలని సూచించారు. మాతృభాష పరిరక్షణకు వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల నుంచి స్ఫూర్తి పొందాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని