కాణిపాకంలో వైభవంగా వినాయక చవితి
చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు వైభంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా వినాయక చవితి వేడుకను ఘనంగా నిర్వహించారు..
కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు వైభంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా వినాయక చవితి వేడుకను ఘనంగా నిర్వహించారు. శనివారం వేకువజామున స్వామివారి మూల విగ్రహానికి సంప్రదాయబద్ధంగా పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని సర్వాలంకృతుడ్ని చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు. కరోనా నేపథ్యంలో మాస్కులను ధరించిన భక్తలను మాత్రమే దర్శనానికి అనుమతించారు.
క్యూలైన్లలో సామాజిక దూరం పాటిస్తూ దర్శనాలను కొనసాగించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక సరిహద్దు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. చవితి ఉత్సవాల్లో లో భాగంగా స్వామివారికి వినాయక వ్రతకల్పం చేశారు. భక్తులకు కావాల్సిన వసతులను ఆలయ ఈవో ఏ.వెంకటేశ్, ఈఈ వెంకటనారాయణ పర్యవేక్షించారు.
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి వెల్లంపల్లి
వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు ఎమ్ఎస్.బాబు, పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి, శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డప్పలతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. పట్టువస్త్రాలను స్వామివారికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ్భరత్గుప్తా, ఎస్పీ సెంథిల్కుమార్, డీఎస్పీ ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?