Vinod Kumar: గవర్నర్లు ఆ ఆర్టికల్ను అనుకూలంగా మార్చుకుంటున్నారు: వినోద్కుమార్
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో చట్టసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు పెండింగ్లో పెట్టే పరిస్థితులు ఉత్పన్నం కాకుండా రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. గడువులోగా బిల్లులను ఆమోదించే పరిస్థితి ఉండాలన్నారు.
హైదరాబాద్: తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో చట్టసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు పెండింగ్లో పెడుతున్న వేళ.. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. గడువులోగా బిల్లులను ఆమోదించే పరిస్థితి ఉండాలన్నారు. ఈ మేరకు జాతీయ న్యాయ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ ఆవస్థికి వినోద్ కుమార్ లేఖ రాశారు.
‘‘రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ను సవరించి ‘యాస్ సూన్ యాస్ పాసిబుల్’ (As Soon As Possible) పదం స్థానంలో ‘విత్ ఇన్ 30 డేస్’ (WithIn 30 days)గా మార్చాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. యాస్ సూన్ యాస్ పాసిబుల్ అన్న 200వ ఆర్టికల్లోని వెసులుబాటును కొంతమంది గవర్నర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అసెంబ్లీ, మండలిలో ఆమోదించి పంపిన బిల్లులను నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నారు. అలా కాకుండా 30 రోజులకు సవరించడం వల్ల గవర్నర్లు నిర్ణీత గడువులోగా ఆమోదించడమో.. తిరస్కరించడమో.. లేక రాష్ట్రపతికి పంపే పరిస్థితులు ఉంటాయి. సవరణలు చేయకపోతే గవర్నర్లు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తీర్పుతో ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాలను.. రాజకీయంగా నామినేట్ అయిన గవర్నర్లు ఇబ్బందులకు గురి చేయడం దురదృష్టకరం. గవర్నర్ వ్యవస్థతో తెలంగాణ రాష్ట్రం సహా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతున్నాయి.
భాజపా పాలిత రాష్ట్రాల్లో పూర్తి సానుకూలంగా ఉన్న గవర్నర్లు.. భాజపాయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆర్టికల్ 200కు సవరణలు చేస్తే తప్ప ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సాఫీగా పాలన చేసే పరిస్థితులు ఉండవు. గవర్నర్ల బాధ్యతలు, బిల్లుల ఆమోదానికి నిర్ణీత గడువు నిర్దేశించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,062 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీని చేపట్టాల్సి ఉంది. ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు బిల్లు గవర్నర్ వద్ద ఇంకా పెండింగ్లోనే ఉంది. గవర్నర్లతో ఇలాంటి పరిస్థితులు దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులు పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది’’ అని లా కమిషన్ ఛైర్మన్ను లేఖలో కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ