Viral: అమెరికా తీరంలో రంగురంగుల మత్స్యం
వెండి, నారింజ రంగులు కలబోసిన భారీ చేపను మీరెప్పుడైనా చూశారా? తాజాగా అలాంటి ఓ చేప అమెరికాలోని ఒరెగాన్ తీరానికి కొట్టుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: వెండి, నారింజ రంగులు కలబోసిన భారీ చేపను మీరెప్పుడైనా చూశారా? తాజాగా అలాంటి ఓ చేప అమెరికాలోని ఒరెగాన్ తీరానికి కొట్టుకొచ్చింది. దాని బరువు 45 కిలోలు. ఒపాగా పిలిచే ఆ చేప ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దీనిని మూన్ ఫిష్గా కూడా పిలుస్తారు. మూడున్నర అడుగుల పొడవున్న ఈ చేప వెండి, ప్రకాశవంతమైన నారింజ రంగుల్లో.. శరీరంపై తెల్లని మచ్చలతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీని విచిత్రమైన రంగుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సాధారణంగా ఈ చేపలు ఆరు అడుగుల పొడవుతో సుమారు 270 కిలోల బరువు వరకు పెరుగుతాయి. ఇవి ఎక్కువగా ఉష్టమండల, సమశీతోష్ణ జలాల్లో.. సముద్రంలోని లోతైన ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. అయితే లోతైన సముద్ర జలాల్లో ఉండే చేపలు తీరానికి కొట్టుకొనిరావడం ఆందోళన కలిగించే అంశంగా పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో సముద్ర జాలాలు వేడెక్కడంతో ఈ చేపలు చల్లని నీటి కోసం ఉత్తర దిక్కుకు వలస వెళ్తున్నట్లుగా వారు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు