Andhra News: ఈనెల 13 నుంచి విశాఖ-విజయవాడ డబుల్‌ డెక్కర్‌ రైలు

ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ మళ్లీ ఉదయించనుంది. విశాఖపట్నం-విజయవాడ మధ్య డబుల్‌ డెక్కర్‌ రైలు (ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌)ను ఎట్టకేలకు రైల్వే అధికారులు పునరుద్ధరించనున్నారు.

Published : 09 Apr 2022 19:39 IST

విజయవాడ: ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ మళ్లీ ఉదయించనుంది. విశాఖపట్నం-విజయవాడ మధ్య డబుల్‌ డెక్కర్‌ రైలు (ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌)ను ఎట్టకేలకు రైల్వే అధికారులు పునరుద్ధరించనున్నారు. ఈనెల 13 నుంచి విశాఖ-విజయవాడ మధ్య వారానికి 5 రోజులు డబుల్‌ డెక్కర్‌ రైలు నడపనున్నట్టు అధికారులు ప్రకటించారు. గురువారం, ఆదివారం మినహా మిగతా రోజుల్లో నడపనున్నారు. విశాఖలో ఉదయం 5.25 గంటలకు ఉదయ్‌ ఎక్స్‌ ప్రెస్‌ బయలుదేరుతుంది. విజయవాడలో సాయంత్రం 5.30గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని