సందర్శకులపై దాడికి యత్నించిన ఏనుగులు

కర్ణాటకలోని కె.గుడిలో రెండు ఏనుగులు సందర్శకుల జీపుపై దాడి చేసేందుకు యత్నించాయి. చామరాజ్‌నగర్‌లోని బిలీరంగనబెట్ట టైగర్‌ రిజర్వ్‌లో కె.గుడి సఫారీ కోసం కొందరు సందర్శకులు జీపులో బయలుదేరారు....

Published : 16 Mar 2021 01:22 IST

బెంగళూరు: కర్ణాటకలోని కె.గుడిలో రెండు ఏనుగులు సందర్శకుల జీపుపై దాడి చేసేందుకు యత్నించాయి. చామరాజ్‌నగర్‌లోని బిలీరంగనబెట్ట టైగర్‌ రిజర్వ్‌లో కె.గుడి సఫారీ కోసం కొందరు సందర్శకులు జీపులో బయలుదేరారు. కాగా దారిలో వారిని రెండు ఏనుగులు కాసేపు ఆందోళనకు గురిచేశాయి. ఓ ఏనుగు జీపు వెనక పరుగెత్తుకొని దాడి చేసేందుకు రాగా మరో గజరాజు ముందునుంచి దాడికి యత్నించింది. జీపు డ్రైవర్‌ సమయోచితంగా వ్యవహరించి ముందున్న ఏనుగును బెదిరించడంతో అది వెనక్కి తగ్గింది. వెంటనే అక్కడి నుంచి జీపును ముందుకు పోనివ్వడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. జీపు డ్రైవర్‌కు సందర్శకులు కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని